మారుతీ వారు వరద బాధిత కస్టమర్లకి సహాయానికి పూనుకున్నారు

నవంబర్ 20, 2015 11:07 am sumit ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మారుతీ వారు చెన్నై లోని వారి కస్టమర్లలో వరద బాధితులకి సహాయం అందించనున్నారు. డీలర్స్ కి ఇంకా వర్క్ షాపులకి కస్టమర్లకి రిపెయిర్ లో సహాయం అందించమని మరుతి వారు ఉత్తర్వులు జారీ చేశారు.  

" చెన్నై లో ఉన్న కొంథ మంది డీలర్లు కూడా వరద్ కారణంగా పని చేయలేకపోయారు. మా ఇంజినీర్లు ఈ అన్ని వర్క్ షాపులను సరిచేసి తిరిగి పని మొదలుపెట్టారు," అని కంపెనీ వారు తెలిపారు. దాదాపుగా 200 పైగా మారుతీ కార్లు నిళ్ళు ఇరుక్కున్న కారణంగా రిపెయిరుకి వచ్చాయి అని, 65 పైగా కార్లను సరి చేసి పంపడం జరిగింది అని, ఇంకా వచ్చే రోజులలో మరెన్నో కార్లు రిపెయిరుకి వచ్చే అవకాశం ఉంది అని తెలపడం జరిగింది.  

"ఇన్షురెన్స్ కంపెనీ వారు అనుకూలంగా స్పందించి మారుతీ వారితో బాధితులకి సహాయం చేస్తాము అని తెలిపినట్టు," ఇండియన్ ఆటో దిగ్గజం తెలిపారు.

గతంలో కూడా జమ్మూ & కష్మీర్లో ఇంకా ముంబైలో ఇటువంటి ఘటనలో సయాం చేసిన అనుభవం ఇప్పుడు మాకు చెన్నైలో పని చేసేందుకు ఉపయోగపడుతుంది.  

వరదలు మొదలు అయిన వెంటనే, మారుతి డీలర్స్ వారు కస్టమర్లకి కారుని నడపవద్దు అనే హెచ్చరికను ఎస్ఎంఎస్ ద్వారా జారీ చేయడం జరిగింది.

"ఆ మెస్సేజీలో కస్టమర్లను కారు నీటిలో మునిగి వుంటే గనుక కారు స్టార్ట్ చేయవద్దు అని, అలా చేయడం వలన హైడ్రో లాక్ కి ఇంజిను గురి అవుతుంది అని తెలిపారు. మారుతీ వారు క్లెయింస్ ని సులువుగా పొందేందుకై ఇన్షురెన్స్ కంపెనీలతో కూడా పని చేస్తున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience