సియాజ్ యొక్క 'ఓ' భద్రతా వేరియంట్స్ ని ప్రారంభిస్తున్న మారుతీ సంస్థ

మారుతి సియాజ్ కోసం nabeel ద్వారా సెప్టెంబర్ 14, 2015 12:35 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ప్రస్తుత రోజుల్లో కారు భద్రత చాలా ముఖ్యమైన విషయం. అధిక భద్రతా ప్రమాణాలను పాటించే భారత వాహన విజ్ఞప్తి తో ఎన్సి ఎపి వంటి సంస్థలు, కారు తయారీదారులు వారి సమర్పణలలో ఉత్తమ భద్రతా లక్షణాలను అందిస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని,భారతదేశం యొక్క అతిపెద్ద వాహనతయరీసంస్థలలో ఒకటైన మారుతి సంస్థ కొనసాగుతున్న నమూనాలు కంటే అదనపు భద్రతా లక్షణాలతో సియాజ్ సెడాన్ యొక్క రెండు కొత్త వేరియంట్స్ ని ప్రారంభించింది. విఎక్స్ ఐ మరియు విడి ఐ వేరియంట్ల ధర రూ.7.48 లక్షలు మరియు రూ.8.37 లక్షలు. వీటిలో డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ఎబిఎస్ వంటి అధనపు భద్రతా లక్షణాలు నవీకరించబడి ఉంటాయి. ప్రస్తుతం, విఎక్స్ ఐ మరియు విడి ఐ వేరియంట్ల ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరుసగా రూ.7.31 లక్షలు మరియు రూ.8.23 లక్షలు.

మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఎస్ కల్సి మాట్లాడుతూ" మా బేస్ వేరియంట్స్ కి మరిన్ని భద్రతా లక్షణాలు అందించడం ద్వారా, మేము వినియోగదారులకు భద్రత అందించే కార్ల కొనుగోలుకు ప్రోత్సాహిస్తున్నాము. సియాజ్ విఎక్స్ ఐ మరియు విడి ఐ వేరియంట్స్ యొక్క అన్ని లక్షణాలు మరియు నిర్దేశాలు, "ఓ" వేరియంట్స్ డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్, ఎబిఎస్ మరియు ఇతర భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది." అని తెలిపారు.

విఎక్స్ ఐ(ఒ) మరియు విడి ఐ(ఒ) వేరియంట్లు సీట్ బెల్ట్ ప్రీటెన్ష్నర్ మరియు ఫోర్స్ లిమిటర్ మరియు డ్రైవర్ వైపు బజర్ తో ఒక సీట్ బెల్ట్ రిమైండర్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఈ వేరియంట్లు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) ని కూడా కలిగి ఉంది. ఈ రూపాంతరాలు రెండు కూడా డ్రైవర్ మరియు ముందు ప్రయాణీకుల కోసం డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ ని కలిగి ఉన్నాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి సియాజ్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience