భారతదేశం లో అనధికారికంగా బయటపడిన జాగ్వార్ ఎక్స్ఇ విశేషాలు
జాగ్వార్ ఎక్స్ఈ 2015-2019 కోసం raunak ద్వారా నవంబర్ 05, 2015 02:10 pm ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
పూనే లో ఏఆర్ఏఐ సౌకర్యం యొక్క రహస్య నివేదిక ప్రకారం జాగ్వార్ సంస్థ ఆడి ఎ4, బిఎండబ్లు 3-సిరీస్ మరియు మెర్సెడెజ్-బెంజ్ సి-క్లాస్ - ఎక్స్ఇ వంటి వాటికి సమాధానం కానున్నది. వాహనతయారి సంస్థ ఎక్స్ఇ వాహనాన్నిఫిబ్రవరి లో రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పో వద్ద ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. ఈ సెడాన్ 2014 లో బహిర్గతమయ్యింది మరియు యునైటెడ్ కింగ్డమ్ లో ల్యాండ్ రోవర్ యొక్క సోలిహుల్ తయారీ సౌకర్యం వద్ద తయారుచేయబడుతున్నది. భారతదేశం గురించి మాట్లాడితే, జాగ్వార్ పోటీ ధరలు అందించడానికి ఎక్స్ఇ ని స్థానికంగా అసెంబ్లీ చేయలని ఆలోచిస్తున్నట్టు సంస్థ తెలిపింది. అదనంగా, దాని మూడు ప్రధాన పోటీదారులు - ఎ4, సి-క్లాస్, 3-సిరీస్ అన్నీ కూడా స్థానికంగా ఆయా తయారీ సౌకర్యాలు వద్ద అసెంబ్లీ చేయబడ్డాయి.
యాంత్రికంగా జాగ్వార్ ఎక్స్ఇ ని తయారీసంస్థ ఇంజీనియం రేంజ్ ఇంజిన్లతో ప్రవేశపెట్టింది. ఈ సెడాన్ 3.0 లీటర్ వీ6 పెట్రోల్ తో పాటు 2.0 లీటర్ టర్బో చార్జెడ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజీనియం ఇంజిన్లని రండు దశలలో అందిస్తుంది. ఈ 2.0 లీటర్ ఇంజీనియం డీజిల్ ఇంజిన్ 163ps శక్తిని మరియు 380Nm టార్క్ ని, అలానే 180ps శక్తిని మరియు 430Nm టార్క్ ని అందిస్తుంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ 200Ps శక్తిని మరియు 280Nm టార్క్ ని, అలానే 240Ps శక్తిని మరియు 340Nm టార్క్ ని అందిస్తుంది. సూపర్ చార్జెడ్ 3.0 లీటర్ v6 ఇంజిన్ 340Ps శక్తిని మరియు 450Nm టార్క్ ని అందిస్తుంది.
సంస్థ కూడా 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ఇటీవల వారి మొదటి ఎస్యువి ఎఫ్-పేస్(భారత ప్రత్యేక) ని వెల్లడించింది. ఈ వాహనం సంస్థ యొక్క కొత్త తేలికైన అల్యూమినియం నిర్మాణం ఆధారంగా ఎక్స్ఇ తో ప్రారంభమయ్యింది మరియు కొత్త ఎక్స్ఎఫ్ తో పంచుకుంది. జాగ్వార్ ఎఫ్-పేస్ గురించి మరింత లోతుగా చదవండి.
ఇంకా చదవండి:
ఎక్స్ఎఫ్ ఏరో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ ను 52 లక్షల వద్ద ప్రవేశపెట్టిన జాగ్వర్ ఇండియా
0 out of 0 found this helpful