• English
  • Login / Register

భారతదేశం లో కొత్త కంపెనీ సృష్టిస్తున్న ఇసుజు సంస్థ

ఇసుజు ఎమ్యూ 7 కోసం konark ద్వారా నవంబర్ 03, 2015 11:52 am ప్రచురించబడింది

  • 20 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Isuzu MU 7

ఢిల్లీ:  ఇసుజు మోటార్స్ లిమిటెడ్, జపాన్, ఒక కొత్త సంస్థ ఇసుజు ఇంజినీరింగ్ బిజినెస్ సెంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఐఇబిసీఐ) ని అనుసంధానం చేసింది. ఈ సంస్థ పరిశోధన  & అభివృద్ధి (R&D) ని నిర్వహిస్తుంది మరియు  కంపెనీ కోసం సంబంధిత కార్యకలాపాలు తీసుకోవడం మరియు ఇసుజు మోటార్స్ ఇండియా యొక్క సామర్ధ్యం మరియు నాణ్యత స్థాయిలు మెరుగుపరచడం వంటి వాటిపై దృష్టి సారిస్తుంది. ఈ కొత్త బిజినెస్ యూనిట్ ఉత్పత్తి మొదలు దశలో 70% స్థానికీకరణ సాధించడానికి ఉపయోగపడుతుంది మరియు సమీప భవిష్యత్తులో పూర్తి స్థానికీకరణను అందిస్తుంది. ఐఇబిసీఐ మరో అదనపు బాధ్యత , ఇసుజు అంతర్జాతీయ ఆపరేషన్ల కోసం మూల భాగాలకు ఒక ప్రత్యేక కేంద్రంగా ఉండడం.   

ప్రస్తుతం ఇసుజు మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్  నొహిరో యమగుచి, ఇతనే ఇసుజు ఇంజినీరింగ్ బిజినెస్ సెంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి కూడా డైరెక్టర్. ఐఇబిసీఇ పూర్తి స్థానికీకరణ సాధించడానికి ఇసుజు మోటార్స్ ఇండియా కి మద్దతుగా ఉంటుంది. ఈ కొత్త కంపెనీ రీసెర్చ్ & డెవలప్మెంట్ కార్యకలాపాలతో ఇఎంఐ కొరకు  సహాయం చేస్తుంది, ఇది సంస్థ భారత వినియోగదారుల అవసరాలను తీర్చడానికి అనుమతిస్తుంది. 

ఇసుజు ఇంజినీరింగ్ బిజినెస్ సెంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇసుజు మోటార్స్ ఇండియా  డైరెక్టర్, మిస్టర్ నొహిరో యమగుచి మాట్లాడుతూ " విలువ మరియు నాణ్యత గల ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు అందించడం కొరకు నిరంతరం కృషి చేస్తూ ఉంటాము. ఇసుజు మోటార్స్ 2012 లో భారతదేశం లో దాని కార్యకలాపాలు ప్రారంభించిన దగ్గర నుండి ఇది నిజానికి ఇసుజు సాధించిన కీ మైలురాయిగా ఉంది. కొత్త ఇసుజు మోటార్స్ ఇండియా తయారీ ప్లాంట్ స్రీసిటీ వద్ద వద్ద , వచ్చే ఏడాది ప్రారంభంలోనికి  రానున్నది. ఐఇబిసీఐ సరఫరాదారు నాణ్యత, ముడిసరుకుల ధరలు మరియు పరిశోధన  & అభివృద్ధి కార్యాకలాపాలు వంటి వాటిపై  విపరీతమైన దృష్టి ఉంచడానికి అనుమతిస్తుంది. ఇది రెండు సంస్థలు వారి బలాలు పరపతి ద్వారా ఒక సేంద్రీయ వృద్ధి సాధించడానికి సహాయం చేస్తుంది, ముఖ్యంగా ఐఎంఐ భారతదేశం లో దాని పూర్తి స్థాయి కార్యకలాపాలు కీలకమైన దశలో ఉన్నప్పుడు సహాయం చేస్తుంది. ఐఇబిసీఐ సమర్థవంతంగా భాగాలు తీసుకోవడం ద్వారా ఇసుజు యొక్క గ్లోబల్ ఆపరేషన్స్ కి మద్దతు ఇస్తుంది. భారతదేశంలో సమర్థవంతమైన సరఫరాదారులకు ధన్యవాదాలు." అని తెలిపారు.

ఇసుజు మోటార్స్ ఆగస్టు 2012 లో భారతదేశం ప్రవేశించింది.  ప్రస్తుతం ఇసుజు డి-మాక్స్ రేంజ్ పికప్ ట్రక్కులు మరియు భారతదేశం అంతటా 27 డీలర్షిప్ల ద్వారా ఎమ్యు-7 ఎస్యువి లను విక్రయిస్తుంది.  

was this article helpful ?

Write your Comment on Isuzu MU 7

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience