జెట్టా కు కొత్త టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ ను అందించబోతున్న వోక్స్వాగన్
published on జనవరి 27, 2016 11:31 am by saad కోసం వోక్స్వాగన్ జెట్టా
- 5 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వోక్స్వ్యాగన్ భారతదేశం, ఎప్పటికప్పుడు దాని వాహనాలు ను నవీకరించడానికి సిద్ధంగా ఉంది. జర్మన్ వాహన తయారీదారుడు, ఇప్పుడు జెట్టా సెడాన్ లోపలి భాగం కోసం ఒక కొత్త నవీకరణ తో రావడం జరిగింది. జెట్టా, గత సంవత్సరం ఫేస్లిఫ్ట్ వెర్షన్ తో వచ్చిని కానీ, ఇప్పటి తాజా సమాచార వ్యవస్థ కోల్పోయింది. ఇప్పుడు వోక్స్వ్యాగన్, ఇటీవల విడుదల బీటిల్ వాహనం లో ఉండే ఒక కొత్త సమాచార వ్యవస్థ తో నవీకరించబడింది.
కొత్త సమాచార వ్యవస్థ, అనేక లక్షణాలను కలిగి ఉంది పాత దాన్ని బర్తీ చేసి దాని స్థానంలో కొత్త సమాచార వ్యవస్థ విలీనం చేయడం జరిగింది మరియు దీనిని, నియంత్రించడానికి సైడ్ భాగంలో బటన్ లను ఉంచడం జరిగింది. ఈ నవీకరించబడిన యూనిట్, స్పోట్స్ టచ్ స్క్రీన్ ప్రదర్శన, సింగిల్ సిడి ప్లేయర్, బ్లూటూత్, యూఎస్బి మరియు ఆక్స్ ఇన్ కనెక్టవిటీ తో పాటు ఎస్డి కార్డ్ సౌకర్యం వంటి లక్షణాలతో వస్తుంది. ఈ ప్రదర్శన, పార్కింగ్ సెన్సార్లతో అడాప్టివ్ రివర్స్ గైడ్ లైన్ల తో దృశ్యమానతలను అందిస్తుంది. అయితే ఈ రివర్స్ కెమెరా కూడా ఈ విభాగంలో ఈ వాహనం లో అందించబడలేదు. ఇది ఒక ప్రతికూలత గా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అదే 4 స్పీకర్లు / 4 ట్వీటర్లు ద్వారా డెసిబుల్స్ ఆదారితమౌతాయి.
వోక్స్వ్యాగన్ జెట్టా ఫేస్లిఫ్ట్, గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించింది మరియు ఈ వాహనం, కొత్త గ్రిల్ రూపంలో ప్రముఖ సౌందర్య మార్పులు అయిన, వెనుక డి ఆర్ ఎల్ ఎస్ మరియు నవీకరించబడిన టైల్ ల్యాంప్లతో వచ్చింది. ఈ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, ఈ వాహనం రెండు రంగుల స్కీం ను పొందింది. అంతేకాకుండా ఫ్లాట్ బోటం స్టీరింగ్ వీల్ మరియు ఆరు ఎయిర్బాగ్లు, యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ, క్రూజ్ కంట్రోల్ అలాగే అలసట డిటెక్షన్ వ్యవస్థ వంటి భద్రతా లక్షణాలతో అందించబడింది.
యాంత్రికంగా చెప్పాలంటే ఈ జెట్టా వాహనం, అదే 1.4 లీటర్ టి ఎస్ ఐ మరియు 2.0 లీటర్ టిడి ఐ ఇంజన్ లతో కొనసాగుతుంది. అదే పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది అదే డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, 6- స్పీడ్ మాన్యువల్ మరియు 7- స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ రెండిటితో జత చేయబడి ఉంటుంది.
వోక్స్వ్యాగన్ కూడా రాబోయే గ్రాండ్ ఈవెంట్, ఆటో ఎక్స్పో 2016 లో దాని వాహనాలను ప్రదర్శించనుంది. ఈ సంస్థ కార్ల తయారీదారుడు, భారత మార్కెట్ లో ఇప్పటికె అందుబాటులో ఉన్న మూడు కార్ల ను సూక్ష్మ మార్పులను చేసి ఈ మూడు కొత్త ఉత్పత్తులను తిరిగి తీసుకురానున్నాడు. ఈ మూడు వాహనాలు వరుసగా, భారతదేశం కోసం తయారు చేయబడిన అమియో, టైగన్ ఎస్యువి మరియు పసత్ జిటి ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్. వోక్స్వాగన్ యొక్క పెవిలియన్ వద్ద, ఇతర ఉత్పత్తులు వరుసగా బీటిల్, వెంటో మరియు జెట్టా సెడాన్ పోలో మరియు క్రాస్ పోలో వంటి వాహనాలు ప్రారంభించబడతాయి.
ఇది కూడా చదవండి:వోక్స్వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్, టైగన్ మరియు పసత్ జిటిఈ లు 2016 ఆటో ఎక్స్పోలో ప్రారంభం
- Renew Volkswagen Jetta Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful