Choose your suitable option for better User experience.
  • English
  • Login / Register

భారతదేశంలో తన యొక్క రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంబించబోతున్న మసెరటి

జూలై 15, 2015 04:33 pm sameer ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 2013 లో ష్రేయన్స్ గ్రూప్ తో మార్కెటింగ్ ఒప్పందం రద్దు అయిన తర్వాత, ప్రఖ్యాత ఇటాలియన్ స్పోర్ట్స్ కారుమేకర్ అయిన మసెరటి, భారత మార్కెట్ లో తిరిగి ప్రవేశించింది. అత్యంత అందమైన కొన్ని కార్ల ఉత్పత్తి పేరొందింది. అంతేకాకుండా మసెరటి, న్యూ ఢిల్లీ, బెంగుళూర్ మరియు ముంబై వద్ద ఉన్న మూడూ ప్రత్యేక డీలర్షిప్ల వద్ద తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. కంపెనీ 2015 మూడవ త్రైమాసికంలో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.

ఈ సంస్థ యొక్క తయారీధారుడు, తన తయారీలో భాగమైన గిబ్లీ మరియు క్వాట్రోపోర్టే అను రెండు కార్ల అమ్మకాలను ప్రారంబించబోతున్నారు. ఈ క్వాట్రోపోర్టే, రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లతో అందుబాటులో ఉంది. అవి వరుసగా, స్టాండర్డ్ మరియు జిటిఎస్. వచ్చే సంవత్సరం డీజిల్ ఇంజన్ లను ప్రారంబించబోతున్నారు. అయితే, మొదటి నాలుగు డోర్ల స్పోర్ట్స్ సెడాన్ అయిన గిబ్లీ, డీజిల్ ఇంజన్ తో మాత్రమే అందుబాటులో ఉంది. గిబ్లీ పెట్రోల్ వి6 వర్షన్, వచ్చే సంవత్సరం భారతీయ రోడ్లపై వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అధనంగా, మసెరటి యొక్క మొదటి ఎస్యువి అయిన లెవాంటె, వచ్చే సంవత్సరం భారతదేశం లో రంగప్రవేశం చేయనుంది.

సంస్థ వారి కొన్ని నమూనాల ధరలు వెల్లడించింది:

గిబ్లీ డీజిల్ - INR 1.1 కోట్లు

క్వాట్రోపోర్టే డీజిల్ - INR 1.5 కోట్లు

క్వాట్రోపోర్టే జిటిఎస్ - INR 2.2 కోట్లు

ప్రత్యేక మసెరటి డీలర్స్:

1. ఏఎంపి మోటార్స్ - న్యూఢిల్లీ

2. బగ్గా లగ్జరీ మోటార్కార్స్

3. జుబిలాంట్ ఆటోవర్క్స్ ప్రెవేట్ లిమిటెడ్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience