హ్యుందాయి భారతదేశంలో 4 మిలియన్ల అమ్మకాలు సాధించింది

నవంబర్ 26, 2015 06:01 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

హ్యుందాయి శాంట్రో ద్వారా తన భారతీయ ఆరంగేట్రం దగ్గర నుండి వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. తద్వారా హ్యుందాయి తమ భారతీయ వాహన అమ్మకాలతో 4 మిలియన్ అమ్మకాల మైలురాయిని సాధించింది. తమ ఈ 19 ఏళ్ళ భారతీయ ప్రయాణంలో ఈ కొరియన్ వాహన తయారీదారులు ఎన్నో ఒడిదుడుకులు చూసినప్పటికీ ఇటీవలి క్రెటా యొక్క 70,000 బుకింగ్ల ద్వారా తమ ప్రయాణంలో ఇంకొక మైలురాయిని చేరుకోగలిగారు. కేవలం ఎస్యువి విభాగంలో మాత్రమే కాకుండా హ్యుందాయి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో కూడా తమ ఎలీట్ ఐ20 యొక్క 1,50,000 భారతీయ అమ్మకాలు జరిపి మార్కెట్లో అగ్ర గామిగా ఉన్నారు. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు మార్చ్ 2014 లో భారతదేశంలో ప్రారంభమయ్యి ఎన్నో అవార్డులను గెలుచుకోవడం జరిగింది. ఉదాహరణకు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) 2015. హ్యుందాయి ప్రకారం ఈ ఎలీట్ ఐ20 మార్కెట్ లో 66% భాగం కలిగిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ వాహనం అని తెలిపారు.

వెర్నా ఒకప్పుడు తమ ఫ్లూయిడ్క్ డిజైన్ పరిజ్ఞానం ద్వారా తమ విభాగంలో అందరి మన్ననలను పొందింది. అదే పరిజ్ఞానం తరువాత తమ ఎలంత్రా కారులో కూడా వాడడం జరిగింది. తమ యొక్క ఈ 4 మిలియన్ దేశీయ అమ్మకాల మైలురాయి గురించి HMIL, MD మిస్టర్ వైకే కు మాట్లాడుతూ ఇలా అన్నారు." హ్యుందాయి తమ 10 రకాల ఉత్పత్తులతో అంటే ఇయాన్ నుండి శాంటా ఫే వాహనాల వరకూ అన్నిటా అగ్ర గామిగా ఉంది. హ్యుందాయి ఇప్పుడు దేశీయ ఉత్పత్తి మరియు ప్రపంచ వాహనాలు అన్న దృష్టితో తమ ఉత్పాదకాలు తయారుచేస్తాయి. హ్యుందాయి ఒక అధిక ఎగుమతి మరియు ప్రీమియం కారు ఉత్పత్తి దారునిగా భారతదేశ మారుతున్న అవసరాలకు వినియోగదారుల ఆశయాలకు అనుగుణంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఇంకా ఈ విధంగా హ్యుందాయి సంస్థ భారతదేశంలో ఒక వేగవంతమైన అమ్మకాల దిశగా తమ మైలురాయిని చేరుకుంటూ భారతీయ మార్కెట్ పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకుంటోంది."

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience