నవంబర్ నెలకు గాను దేశీయ అమ్మకాలలో 55% అభివృద్ధి ని నమోదు చేసుకున్న ఫోర్డ్ ఇండియా

డిసెంబర్ 04, 2015 01:59 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఫోర్డ్ భారతదేశం, నవంబర్ నెల విక్రయాల గణాంకాలను వెల్లడించింది. నవంబర్ 2014 వ సంవత్సరం తో పోలిస్తే, అమెరికన్ కార్ల అమ్మకాలు ఈ సమయంలో 55% అబివృద్ధి ని సాధించాయి. గత సంవత్సరం నవంబర్ లో అమ్మకాలు 5,661 యూనిట్లు, దీనితో పోలిస్తే సంస్థ, ఈ నవంబర్ నెల భారతదేశం లో 8,773 యూనిట్లను అమ్మగలిగింది. అంతేకాకుండా సంస్థ, ఎగుమతులలో కూడా 19 శాతం వృద్ధిని సాధించింది. ఎగుమతుల వివరాల కు వస్తే, గత సంవత్సరం నవంబర్ లో దీని యొక్క ఎగుమతుల వివరాలు 7,070 యూనిట్లు. దీనితో పోలిస్తే ఈసారి (సుమారు) 8,416 యూనిట్ల కార్లను ఎగుమతి  చేసింది.

ఫోర్డ్ సంస్థ, ఇటీవల ప్రవేశపెట్టిన ఫిగో అస్పైర్ సెడాన్ మరియు కొత్త ఫిగో హ్యాచ్బ్యాక్ వాహనాల కారణంగా (దేశీయ మరియు అంతర్జాతీయ అమ్మకాలను కలిపితే) గత నెల మొత్తం 17,189 యూనిట్లను అమ్మగలిగింది. అంతేకాకుండా, సంస్థ వారు అక్టోబర్ లో ఈకోస్పోర్ట్ యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను ప్రవేశపెట్టిన కారణంగా పెరుగుతున్న అమ్మకాలకు మరింత సహాయపడింది. యూఎస్ కంపెనీ, అన్ని వేళలా మొమెంటం ను సాధించాలనుకుంటుంది మరియు భారత లైనప్ లో 2016 వ సంవత్సరం ఆటో ఎక్స్పోలో, కొత్త ఎండీవర్ ఎస్యూవీ ప్రారంభం ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఎండీవర్ ప్రీమియం, ఏడు సీట్ల విభాగంలో వస్తుంది మరియు ఈ వాహనం, చేవ్రొలెట్ ట్రయిల్బ్లేజర్ అలాగే టయోటా ఫార్చ్యూనర్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది.

అమ్మకాలు సంఖ్య మీద సంతృప్తి ని, ఫోర్డ్ భారతదేశం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్కెటింగ్, సేల్స్ మరియు సర్వీస్ అయిన అనురాగ్ మెహ్రోత్రా వ్యక్తం చేశారు "ఫోర్డ్ ఇంకా మళ్ళీ పరిశ్రమ వృద్ధిలో అధిగమించి ఉంది మా ఉత్పత్తి నేతృత్వంలోని పరివర్తనానికి వ్యూహం డివిడెండ్లను పొందుతోంది."

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience