వోక్స్వ్యాగన్ సంస్థ కి ఇకపైన 'చీట్ డివైజ్' లతో వాహనాలను తయారుచేయమని ఒక పూచీకట్టు పత్రికను ఇవ్వవలసినదిగా కోరిన NGT
జనవరి 07, 2016 03:05 pm sumit ద్వారా సవరించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) వోక్స్వ్యాగన్ సంస్థ కి ఇకపైన 'చీట్ డివైజ్' లతో వాహనాలను తయారుచేయమని ఒక పూచీకట్టు పత్రికను ఇవ్వవలసినదిగా కోరింది. ఢిల్లీ నుండి కొంతమంది జర్మన్ కార్ల తయారీ సంస్థ ఉద్గార నిబంధనలను ఉల్లంఘించినట్లు ఫిర్యాదు చేసినప్పుడు ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.
ఈ సంస్థ ప్రపంచవ్యాప్త ఉద్గార కుంభకోణంలో ఇరుక్కుంది. ఇటీవల కార్ల ఉత్పత్తి సంస్థ ఉద్గార నియమాలు ఉల్లంఘించిన కారణంగా US ప్రభుత్వంచే పిటీషియన్ వేయబడింది. టెస్ట్ సమయంలో పర్యావరణానికి హానికరమైన 6,00,000 లక్షల డీజిల్ ఇంజిన్లను ఏమార్చి పెట్టడం వలన ఈ పిర్యాదు వచ్చింది. ఈ వాదనలు నిజమని నిరూపించబడితే వాహనతయారి సంస్థ $ 20 బిలియన్ వరకూ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.
వోక్స్వ్యాగన్ కార్లలో ఇంజిన్లు కంప్యూటర్ సాఫ్ట్వేర్ కలిగి ఉండి వివిధ పరిస్థితులు విశ్లేషించడం ద్వారా పరీక్ష దృశ్యాలను పసిగడతాయి. అటువంటి టెస్ట్ పరిస్తితులని పసిగట్టినప్పుడు ఆ సాఫ్ట్వేర్ కారు యొక్క మోడ్ ని సాధారణ శక్తి మరియు పనితీరు క్రింద నడిచే విధంగా మారుస్తుంది, దీని ద్వారా ఎమిజన్ తగ్గి కారు టెస్ట్ పాస్ అవుతుంది. కారు కనుక రోడ్ పైకి వస్తే ఇది యు.ఎస్ లో అనుమతించిన కాలుష్య ఉద్గారం కంటే 40 రెట్లు ఎక్కువ కాలుష్యం విడుదల చేస్తుంది.
పోయిన నెల, వోక్స్వ్యాగన్ ఉద్గార నిబంధనలను ఉల్లంఘన ఆరోపణలు తర్వాత, భారతదేశం లో 3 లక్షల వాహనాలను రీకాల్ చేసింది.
ఇంకా చదవండి
వోక్స్వ్యాగన్ "ఇమేజ్ మేక్ఓవర్" ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది న్యూ డిల్లీ:
0 out of 0 found this helpful