• English
    • లాగిన్ / నమోదు

    15000 యూనిట్లు మైలురాయిని విజయవంతంగా చేరుకున్న ఫోర్డ్ ఫిగో ఆస్పైర్

    డిసెంబర్ 01, 2015 05:27 pm manish ద్వారా ప్రచురించబడింది

    19 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్:

    క్రిస్మస్ సీజన్ త్వరగా వస్తున్న కారణంగా, అమెరికన్ వాహన తయారీసంస్థ ఫోర్డ్, తన ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ సెడాన్ కారణంగా బాగా ఉత్సాహకరంగా ఉంది. ఈ కాంపాక్ట్ సెడాన్  15,000 యూనిట్లకు పైగా విక్రయించబడ్డాయి. ఈ అమ్మకాల సంఖ్య ఆగస్ట్ నుండి అక్టోబర్ 2015 వరకూ లెక్కించబడినవి.  ఈ కారు సంస్థ యొక్క  అంతర్జాతీయ ఉత్పత్తి అభివృద్ధి సామర్థ్యాలు నుంచి వెలువడిన ఫోర్డ్ ఇండియా యొక్క మొదటి విడత. ఈ కారు 1908 లో ప్రారంభించబడిన  పురాతన మోడల్ T, ప్రారంభించబడిన రోజునే ప్రారంభించబడినది మరియు అదే రోజు నుండి నెలకు 5000 యూనిట్లకు పైగా సగటు అమ్మకాలను సాధిస్తుంది.  

    "అక్టోబర్ 2014 లో 6,723 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఈ సంవత్సరం ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కారణంగా అమ్మకాలు 10,008 యూనిట్లు పెరిగాయి. నవంబర్ లో పండుగ సీజిన్ కారణంగా అమ్మకాలు పెరుగుదల కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము. ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా 189 నగరాలు అంతటా 352 డీలర్‌షిప్ లను కలిగి ఉంది మరియు అమ్మకాలు టైర్ 3 మరియు టైర్ 2 లో ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఊహిస్తున్నాము. ఈ కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్, హ్యుందాయి ఎక్సెంట్, టాటా జెస్ట్ మరియు స్విఫ్ట్ డిజైర్ వంటి వాటితో పోటీ పడుతోంది. ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ లో స్టయిలింగ్, ఆస్టన్ మార్టెన్ లో ఉన్నటువంటి గ్రిల్, అనేక పరికరాలు మరియు శక్తివంతమైన ఇంజిన్ ఇవన్నీ కూడా ఈ కారుకి పోటీతత్వాన్ని ఇస్తాయి. " అని ఫోర్డ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గౌతం పేర్కొన్నారు.

    ఇంకా చదవండి

    was this article helpful ?

    Write your Comment on Ford ఆస్పైర్

    ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం