డీజిల్ బాన్ ద్వారా అధికంగా ప్రభావితం చేయబడుతున్న కార్లు!
ఢిల్లీ: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎంజిటి) డిసెంబర్ 11, 2015 నుండి జనవరి 6, 2016 వరకు డీజిల్ ఇంజన్ వాహనాల రిజిస్ట్రేషన్లను ఆపివేసింది. పొడిగించిన నిషేదం ప్రకారం, భారతదేశం యొక్క సుప్రీం కోర్టు ఒక ఆర్డర్ ను జారీ చేసింది. అది ఏమిటంటే, 2.0 లీటర్లు లేదా అంత కంటే ఎక్కువ సామర్ధ్యం గల ఇంజన్లను కలిగిన వాహనాలను, ఎన్ సి ఆర్ లో జనవరి 1 నుండి మూడు నెలల పాటు నిషేదించాలని ఆర్డర్ జారీ చేసింది. శక్తివంతమైన డీజిల్ ఇంజన్లు సుమారు 36 శాతం డిల్లీ లో అమ్ముడుపోతున్నాయి. అయితే 90 శాతం ఎస్యువి లు మరియు యుటిలిటీ వాహనాలు డీజిల్ ఇంజన్ లపై అమలు అవుతున్నాయి.
ఇక్కడ నిషేదం- ద్వారా ప్రభావితం అయిన కొన్ని కార్ల జాబితా ఉంది
టయోటా ఫార్చ్యూనర్
నవంబర్ 2015 లో టయోటా, 1058 ఫార్చ్యూనర్ యొక్క యూనిట్లను విక్రయించింది. దీని వలన ఈ వాహనం, ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో ఒక ప్రముఖ వాహనంగా ఉంది. ఇది, ఒక 3000 సిసి డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంది. సుప్రీం కోర్టు, 2000సిసి + మార్గదర్శకాలను ఉల్లంఘించి ఉంటే ఇప్పుడు నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది అని ఆదేశం వెల్లడించింది.
ఇది కూడా చదవండి:
మహీంద్రా ఎక్స్యువి 500
ఈ మహీంద్రా ఎక్స్యువి 500 వాహనం , 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించేది. కానీ ఇప్పుడు 2000 సిసి ను ఉపయోగిస్తుంది. మహీంద్రా, నవంబర్ లో 2794 ఎక్స్యువి 500 యూనిట్లను విక్రయించింది మరియు దీని వలన నిషేధం గట్టిగా భారత కార్ల పై ఉంది.
ఇది కూడా చదవండి: డిల్లీలో డీజిల్ బాన్ ద్వారా పేరుకున్న 1,000 ఖరీదు కార్లు ఇంకా మహింద్రా ఎదుర్కొంటున్న అడ్డంకులు
ఆడి క్యూ7
జర్మన్ కార్ల తయారీ సంస్థ, ఇటీవల ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో దాని అన్ని కొత్త క్యూ7 ను 72 లక్షల వద్ద ప్రారంభించింది.
2000 సిసి మార్క్ ను అధిగమిస్తే నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది ఇది ఒక శక్తిమంతమైన 3-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ యూనిట్ తో ఉంది.
టయోటా ఇన్నోవా
ఇన్నోవా లీటర్ డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. టయోటా నవంబర్ నెలలో, ఇన్నోవా యొక్క 3944 యూనిట్లను విక్రయించింది మరియు ఇది, జపనీస్ కార్ల కోసం ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
మహీంద్రా స్కార్పియో
మహీంద్రా, నవంబర్ లో స్కార్పియో 4118 యూనిట్లను విక్రయించింది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటే ఈ ప్రభావానికి గురి అవుతుంది.(అయింతే ఈ వాహనం యొక్క బేస్ వేరియంట్లో 2.6 లీటర్) ఉండటం వలన ఈ స్కార్పియో కూడా ఈ నిషేధం ద్వారా ప్రభావితం అవుతుంది.
ఇది కూడా చదవండి:
టాక్సీలు సిఎంజి లతోనే నడవాలని అమలు చేసిన ఢిల్లీ సుప్రీం కోర్ట్