2016 నుండి 3% ధరల పెంపు ని ప్రకటించిన స్కోడా, నిస్సాన్ మరియు డాట్సన్
నిస్సాన్, డాట్సన్ మరియు స్కోడా కొత్త సంవత్సరంలో తమ ఉత్పత్తుల ధరను పెంచుకుంటున్నాయి. ఈ ధరల పెంపు వివిధ మోడళ్లకు 1 నుండి 3 శాతం వరకు మారుతూ ఉంటుంది. నిస్సాన్ మరియు డాట్సన్ ఉత్పత్తులు 1 నుండి 3 శాతం వరకూ ఉంటుంది మరియు స్కోడా కార్లు 2 నుండి 3 శాతం వరకూ పెంపు ఎదుర్కొంటుంది. గతంలో, మారుతి, టయోటా, హ్యుండాయ్, మెర్సిడెస్ బెంజ్ మరియు BMW కూడా 2016 నుండి ధరల పెంపు ప్రకటించారు. చాలా బ్రాండ్స్ 'రైజింగ్ ఇన్పుట్ కాస్ట్' అనే కాన్సెప్ట్ తో వస్తున్నాయి. కొత్త ధరల పెంపు జనవరి 1, 2016 నుండి అమలులోకి వస్తాయి. మోడల్ మరియు వేరియంట్ ఆధారంగా ధర రూ. 14,000 నుండి 15,000 పెరిగే అవకాశం ఉంది. నిస్సాన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా ఈ " ధరలు యొక్క పెరుగుదల నెగిటివ్ ఇంపాక్ట్ ని సాఫ్ట్ గా చేస్తాయి మరియు కంపెనీ పోటీగా ఉండడానికి సహాయం చేస్తాయి.
నిస్సాన్ టెరానో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే జపనీస్ బ్రాండ్. మారుతి దాని ఉత్పత్తుల ధరను రూ. 20,000 వరకూ పెంచుతుంది. అయితే హ్యుందాయ్ దాని ధరను రూ.30,000 వరకూ పెంచుతుంది. మెర్సిడెస్ బెంజ్ కార్లు 2 శాతం వరకు ధరలు పెరగగా, టొయోటా మరియు BMW కార్లు 3 శాతం వరకూ పెరిగాయి. ఈ పెరిగిన ధరతో పాటూ ఢిల్లీలోని ఆడ్ - ఈవెన్ కారు మరియు డీజిల్ కారు రిజిస్ట్రేషన్ బాన్ ఇవన్నీ కూడా 2016 లో కారు కొనే వారికి ఒక కష్టమైన సమయం అని చెప్పవచ్చు.
ఇంకా చదవండి
nabeel
- 13 సమీక్షలు