పెట్రోల్ ధర 36పైసలు మరియూ డీజిల్ ధర 87పైసలుగా పెరిగాయి

నవంబర్ 18, 2015 10:37 am nabeel ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

భారత-యూఎస్ ఎక్స్‌చేంజ్ ధరలో మార్పు కారణంగా, ఇంధన ధరలపై ప్రభావం పడింది. ఈసారి, పెట్రోల్ ధర 36పైసలు మరియూ డీజిల్ ధర 87పైసలుగా పెరగటం జరిగింది. దీని పరిణామంగా, డిల్లీలో ఇప్పుడు లీటరు పెట్రోల్ ధర రూ.61.06 ఉండగా, లీటరు డీజిల్ ధర రూ.46.80 గా ఉంటుంది. అంతర్జాతీయ ఎక్స్‌చేంజ్ ధరలు ప్రత్యక్షంగా కస్టమర్లపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో యూఎస్‌డీ విలువ పెరుగుతోంది. ఈ ధరల పెంపునకు ఇదొక కారణం.  

"ఈ ధరల సవరణ ద్వారా, అంతర్జాతీయ పెట్రోల్ ఇంకా డీజిల్ మరియూ రుపీ-డాలర్ ఎక్స్‌చేంజ్ ధరల మార్పులు ప్రత్యక్షంగా కస్టమర్లపై ప్రభావం చూపనున్నాయి," అని ఇండియన్ ఆయిల్ కార్ప్ వారు తెలిపారు.

ఈమధ్య, ఇంధనంపై భారత ప్రభుత్వం మరింత డ్యూటీ ని మోపుతోంది. ఇందు వలన ధరల పెంపు జరిగింది. పైగా, ఈ సవరణ ప్రతీ పక్షం రోజులకి జరుగుతూ ఉండి ఆయిల్ కంపెనీలపై ఎటువంటి ప్రభావం పడకుండా ఉండేట్టుగా ఉండాలి. నెలలో ప్రతీ మొదటి తారీఖు ఇంకా నెల మధ్యలో, రుపీ-డాలర్ ఎక్స్‌చేంజ్ ఇంకా మునుపటి పక్షంలో దిగుమతి ధరను అనుసరించి ఆయిల్ కంపెనీ వారు ధరలను అంచనా వేస్తూ ఉంటారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience