డిల్లీ ప్రభుత్వం వారు 10 ఏళ్ళ పైగా కార్లకి దాదాపు 1.5 లక్షల వరకు డిస్కౌంట్ ని అందిస్తున్నారు

అక్టోబర్ 07, 2015 03:15 pm manish ద్వారా సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

డిల్లీ ప్రభుత్వం వారు ప్రస్తుతం 10 ఏళ్ళ పైగా కార్లపై విధించిన నిషేధానికి సహాయం చేస్తున్నారు. క్రితం ఏప్రిల్ లో న్యాషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ప్రత్యేకించి డీజిల్ కార్లపై నిషేధాన్ని కోరారు.

ఈ నిషేధంపై ఇంకా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా డిల్లీ ప్రభుత్వం వారు ప్రజలు ఈ ఆచరణని ఆపాలి అని ప్రత్యామ్నాయలకై ప్రయత్నిస్తున్నారు. దీనితో పాటుగా ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నారు. ఈ ప్రతిపాదన రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు ప్రకటించారు. 

పాత కార్లు అమ్మిన కొత్త కారు కొనుగోలు చేసిన వారికి ఒక సర్టిఫికేటు ఇస్తాము అనీ, అది చూపించటం ద్వారా వారికి డిస్కౌంట్లు ఇవ్వబడతాయి అని తెలిపారు. ఈ సర్టిఫికేట్లు ఎన్నో షోరూంలలో చెల్లుతాయి. డిస్కౌంటు ధర కారు పరిస్థితి పై ఆధారపడి ఉంటుంది. ఈ డిస్కౌంట్లు రూ. 50,000 నుండి రూ. 1.5 లక్షల వరకు కారు పరిస్థితి ని బట్టి అందుకోగలరు.

గడ్కరీ కూడా చిన్న కార్ల డిస్కౌంట్, వారి పరిస్థితి బట్టి రూ.30,000 వరకూ తగ్గవచ్చని తెలిపారు. ఈ ప్రణాళిక ఇప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం ద్వారా అమలు పొందలేదు, ఇంకా ఇది ప్రాథమిక ప్రతిపాదన దశలోనే ఉంది. దీని వలన మనకు అర్ధమైనది ఏమిటంటే డిల్లీ లో ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పాత కార్లు సంఖ్య  గణనీయంగా తగ్గే అవకాశం ఉండవచ్చు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience