జీప్ ఇండియా లైవ్ గ్రాండ్ చెరోకీ మరియు వ్రాంగ్లర్ ల ని అందిస్తోంది
జీప్ గ్రాండ్ చెరోకీ 2016-2020 కోసం raunak ద్వారా డిసెంబర్ 31, 2015 03:11 pm ప్రచురించబడింది
- 23 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2016 ఆటో ఎక్స్పోలో భారతీయ లైనప్ వాహనం అయినటువంటి జీప్ ని ప్రారంబించబోతున్నట్టు తయారీదారులు బహిర్గతం చేసారు.
న్యూ డిల్లీ ;
భారత ఆటోమోటివ్ రంగం ఇష్టపడేవారి కోసం జీప్ బ్రాండ్ ని ప్రారంభించడానికి ముందే జీప్ బ్రాండ్ ప్రీ లాంచ్ వెబ్ సైట్ ని ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ ఫియట్-క్రిస్లర్ (FCA - ఫియట్-క్రిస్లర్ ఆటోమొబైల్స్) తో పాటే కలిసి అధికారికంగా ఫిబ్రవరి 2016 ఆటో ఎక్స్పోలో ప్రారంభించబడుతుంది. ఇప్పటిదాకా FCA భారతదేశం లో ఫియట్, అబార్త్, మసెరటి, ఫెరారీ బ్రాండ్లు అందిస్తోంది. జీప్ బ్రాండ్ తదుపరి సంవత్సరం ప్రారంభ జాబితాకు చేర్చబడుతుంది.
భారతదేశం లో FCAఅధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్, కెవిన్ ఫ్లిన్ మాట్లాడుతూ " ఈ బ్రాండ్ భారతదేశం లో ప్రారంభం చేయటం వల్ల ఇది మాకు మంచి ప్రతిష్ట ని తీసుకొస్తుంది " అన్నారు. నేడు FCAభారత దేశం లో ఈ జీప్ బ్రాండ్ ని ప్రారంభం చేయటం వల్లమార్కెట్ లో ఒక మైలు రాయిగా ఉండబోతోంది అని ఆశిస్తున్నారు.
అతను "ఈ జీప్ బ్రాండ్ వెబ్ సైట్ లో పొందిన స్థానాన్ని చూస్తుంటే గ్లోబల్ మార్కెట్ లో దాని స్థానాన్ని విస్తరించేలా కనిపిస్తుంది " అని జోడించారు. రాబోయే నెలల్లో ఈ అద్భుతమైన బ్రాండ్ మార్కెట్ లోకి రాబోతుంది అన్నారు.
జీప్ ఇండియా వీక్షించండి.
అమెరికన్ SUV తయారీదారు అపరిమిత వ్రాంగ్లర్ తో పాటూ గ్రాండ్ చెరోకీ ని కుడా పిబ్రవరి లో ప్రారంభించబోతోంది. FCA ఈ సంవత్సరం జూలై ప్రారంభం లో టాటా మోటార్స్ లిమిటెడ్ పాటు ఫియట్ యొక్క Ranjangaon తయారీకి $ 280 మిలియన్ పెట్టుబడి ని పెట్టింది అని ప్రకటించింది. ఈ పెట్టుబడి జీప్ అనే కొత్త గ్లోబల్ వాహనాన్ని తొలిసారిగా భారతదేశం లో ప్రారంభించడానికి మరియు ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయటానికి ఉపయోగపడుతుంది.
ఇది కుడా చదవండి .